హైదరాబాద్సిటీ, వెలుగు: సికింద్రాబాద్నుంచి కాజీపేట వరకు మూడు, నాలుగు రైల్వే లేన్లనిర్మాణానికి త్వరత్వరగా అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించి దక్షిణ మధ్య రైల్వే అధికారులు డీపీఆర్రెడీ చేసి రైల్వే బోర్డుకు పంపించారు. సికింద్రాబాద్– కాజీపేట మధ్య మూడు, నాలుగో రైల్వే లైన్ నిర్మాణానికి ఇదివరకే రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.
ఈ రూట్110 కి.మీ. దూరం ఉండగా, సుమారు రూ. 2,837 కోట్లు అవుతుందని అంచనా వేశారు. దీనికి సంబంధించిన ఫైనల్ లొకేషన్ సర్వే(ఎఫ్ఎల్ఎస్) 2023లోనే పూర్తయ్యింది. డీపీఆర్కూడా రెడీ చేసిన దక్షిణ మధ్య రైల్వే అధికారులు 8 నెలల క్రితం రైల్వే బోర్డుకు సమర్పించారు. ప్రస్తుతం బోర్డు పరిశీలనలో ఉందని, అతి త్వరలోనే దీనికి సంబంధించి అనుమతులు వచ్చే అవకాశం ఉందని రైల్వే అధికారులు ప్రకటించారు.
ఈ రూట్ ఎంతో కీలకం..
ప్రాజెక్టులో భాగంగా సమీప సెక్షన్అయిన కాజీపేట-– విజయవాడ, కాజీపేట-– బల్లార్షా, సికింద్రాబాద్–-వాడి రూట్లను ట్రిప్లింగ్, ఫోర్లేన్లుగా మార్చడానికి అధికారులు నిర్ణయించారు. దీంతో సికింద్రాబాద్– -కాజీపేట మధ్య కూడా ట్రిపుల్, ఫోర్లైన్తప్పనిసరైంది. అంతేగాకుండా అధికారులు సికింద్రాబాద్–-కాజీపేట రూట్ను కీలకంగా భావిస్తున్నారు. ఈ రూట్లో ఇప్పుడు డబుల్ లేన్మాత్రమే అందుబాటులో ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాలను కనెక్ట్ చేసే రైళ్లు ఈ రూట్లోనే ఎక్కువగా ప్రయాణిస్తుంటాయి.
ముఖ్యంగా ఢిల్లీ, కోల్కతా, చెన్నై వెళ్లే రైళ్లు ఈ మార్గంలోనే వెళ్తాయి. సెంట్రల్అండ్ఈస్ట్రన్రీజియన్ల నుంచి ముఖ్యంగా కర్నాటక, తెలంగాణ, ఏపీ, చెన్నై వంటి నగరాల నుంచి వచ్చే రైళ్లన్నీ ఈ రూట్లోనే ప్రయాణిస్తుంటాయి. సింగరేణి కాలరీస్ నుంచి బొగ్గు రవాణా, సిమెంట్, స్టీల్, ఇండిస్ట్రియల్గూడ్స్ తీసుకువెళ్తుంటారు. ఈ రైళ్లన్నీ ఇప్పుడు డబుల్లేన్కారణంగా సిగ్నళ్ల కోసం వేచి ఉంటున్నాయి. త్రీ, ఫోర్ లేన్స్పూర్తయితే ఈ సమస్యలన్నీ తప్పుతాయని అధికారులంటున్నారు.
ఆ రూట్లో ఇప్పటికే పూర్తి..
ప్రస్తుతం సికింద్రాబాద్-–కాజీపేట రూట్ డబుల్ లేన్గా ఉంది. అయితే, ఇప్పటికే మౌలాలి-ఘట్కేసర్ మధ్య మూడో, నాలుగో లైన్ పూర్తయ్యింది. అలాగే, ఘట్కేసర్-– యాదాద్రి మధ్య ఎంఎంటీఎస్ రెండో ఫేజ్ కోసం మూడో లైన్ పనులు కొనసాగుతున్నాయి. దీంతో రాయిగిరి, కాజీపేట మధ్య ట్రిపుల్ లేన్తో పాటు ఫోర్లేన్, ఘట్కేసర్–యాదాద్రి మధ్య 4వ లేన్పనులు చేపట్టనున్నారు. ఘట్కేసర్ నుంచి కాజీపేట వరకు 16 స్టేషన్లు నిర్మించనున్నారు. ఆయా పనులను నాలుగేండ్లలో పూర్తి చేసేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా రెండు ఆర్వోబీలు, మరో 27 రోడ్అండర్బ్రిడ్జిలను కూడా ఈ సెక్షన్ పరిధిలో నిర్మించనున్నట్టు అధికారులు తెలిపారు.
