రెండు రోడ్డు ప్రమాదాల్లోముగ్గురు మృతి

రెండు రోడ్డు ప్రమాదాల్లోముగ్గురు మృతి
  • కోదాడ వద్ద లారీని ఢీకొట్టిన కారు, ఏపీకి చెందిన ఎస్సై, కానిస్టేబుల్‌‌‌‌..
  • మంచిర్యాల జిల్లాలో అదుపుతప్పిన బైక్‌‌‌‌.. సీనియర్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌ మృతి

కోదాడ, వెలుగు : సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఎస్సై, కానిస్టేబుల్‌‌‌‌ చనిపోగా.. మరో కానిస్టేబుల్‌‌‌‌, డ్రైవర్‌‌‌‌ తీవ్రంగా గాయపడ్డారు. కోదాడ పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఏపీలోని అంబేద్కర్‌‌‌‌ కోనసీమ జిల్లా ఆలమూరు ఎస్సై అశోక్‌‌‌‌ (43) ఓ కేసులో నిందితులను పట్టుకునేందుకు కానిస్టేబుల్స్‌‌‌‌ బ్లెస్సన్‌‌‌‌ జీవన్‌‌‌‌ (31), స్వామి, డ్రైవర్‌‌‌‌ రమేశ్‌‌‌‌తో కలిసి ప్రైవేట్‌‌‌‌ వాహనంలో హైదరాబాద్‌‌‌‌కు వెళ్తున్నారు.  

ఈ క్రమంలో దుర్గాపురం బైపాస్‌‌‌‌ వద్దకు రాగానే వీరి వాహనం రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో ఎస్సై అశోక్‌‌‌‌, కానిస్టేబుల్‌‌‌‌ జీవన్‌‌‌‌ అక్కడికక్కడే చనిపోగా, మరో కానిస్టేబుల్‌‌‌‌ స్వామి, డ్రైవర్ రమేశ్‌‌‌‌ తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న కోదాడ పట్టణ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని గాయపడిన వారిని కోదాడలో హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. 

చెట్టును ఢీకొట్టిన బైక్‌‌‌‌.. ఒకరు మృతి

జైపూర్, వెలుగు : ఓ జంతువు అడ్డురావడంతో బైక్‌‌‌‌ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో ఓ వ్యక్తి చనిపోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం మంచిర్యాల జిల్లా జైపూర్‌‌‌‌ మండలం ఇందారం వద్ద బుధవారం రాత్రి జరిగింది. ఎస్సై శ్రీధర్‌‌‌‌ తెలిపిన వివరాల ప్రకారం... రామగుండం కమిషనరేట్‌‌‌‌లో సీనియర్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌గా పనిచేస్తున్న జాదవ్‌‌‌‌ సూర్యకుమార్ (30) బుధవారం రాత్రి డ్యూటీ ముగిసిన తర్వాత, ఏఆర్‌‌‌‌ కానిస్టేబుల్‌‌‌‌ వెంకటేశ్‌‌‌‌తో కలిసి తన బుల్లెట్‌‌‌‌పై మందమర్రికి వెళ్తున్నాడు.

ఇందారం చెక్‌‌‌‌పోస్ట్‌‌‌‌ సమీపంలోకి రాగానే ఓ జంతువు అడ్డు రావడంతో బైక్‌‌‌‌ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. దీంతో సూర్యకుమార్‌‌‌‌ అక్కడికక్కడే చనిపోగా, వెంకటేశ్‌‌‌‌ స్వల్పంగా గాయపడ్డాడు. మృతుడి భార్య రాజశ్రీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.