
తమ ఫేవరేట్ హీరోపై అభిమానం ముగ్గురు యువకుల ప్రాణాలు తీసింది. ఈ దుర్ఘటనతో లక్ష్మేశ్వర్ తాలూకాలోని సురంగి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అసలు విషయం ఏంటంటే.. జనవరి 8న కన్నడ స్టార్ హీరో యష్ పుట్టినరోజు. ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరపాలని భారీ ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ తగిలి ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ ఘటనలో మరో ముగ్గురికి గాయాలవ్వగా.. వారిని లక్ష్మేశ్వర్ ఆస్పత్రికి వారిని తరలించారు. చనిపోయినవారు మురళీ నడవినమణి (20), హనమంత హరిజన్ (21), నవీన్ ఘాజీ (19)గా తెలిసింది. త్వరలోనే ఈ విషయం స్పందించనున్నారు హీరో యష్.