పిడుగు పడి ముగ్గురు స్నేహితులు మృతి

పిడుగు పడి ముగ్గురు స్నేహితులు మృతి

దసరా పండగ రోజు మూడు కుటుంబాల్లో విషాదం అలముకుంది. పిడుగుపాటుతో ముగ్గురు స్నేహితులు అక్కడికక్కడే చనిపోయారు. ఖమ్మం జిల్లా ముదిగొండ ఎస్పీ కాలనీకి చెందిన ఇరుగు శ్రీను (20), బలంతు ప్రవీణ్‌ (19), జి.నవీన్‌ (19), ఉసికెల గోపిలు స్నేహితులు. మంగళవారం సాయంత్రం గ్రామంలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమయ్యింది. దీంతో వారంతా ఓ చెట్టు కిందకు చేరుకున్నారు.

అయితే చెట్టు మీదే పిడుగు పడడంతో ముగ్గురు స్నేహితులు అక్కడికక్కడే చనిపోగా, గోపి తీవ్రంగా గాయపడి ఆపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. గోపిని ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. అయితే అతని పరిస్థితి కూడా విషమంగా ఉందని తెలిపారు డాక్టర్లు. పండగపూట చేతికి అందివచ్చిన బిడ్డలు దూరం కావడంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.