ట్రంకు పెట్టెలో ముగ్గురు అక్కా చెల్లెళ్ల శవాలు.. పంజాబ్‌లో ఘోరం

ట్రంకు పెట్టెలో  ముగ్గురు అక్కా చెల్లెళ్ల శవాలు..  పంజాబ్‌లో ఘోరం

చండీగఢ్ : పంజాబ్‌లోని జలంధర్ జిల్లా కాన్పూర్​లో దారుణం జరిగింది ఆదివారం తప్పిపోయిన  కంచన్(4), శక్తి (7), అమృత (9) అనే ముగ్గురు అక్కాచెల్లెళ్లు వాళ్ల ఇంట్లోని ట్రంక్‌ పెట్టెలోనే విగతజీవులుగా కనిపించారు. పనికోసం జలంధర్ జిల్లాకు వలస వచ్చిన దంపతులకు ఐదుగురు పిల్లలు ఉన్నారు. దంపతులిద్దరూ ఆదివారం పనికి వెళ్లారు. సాయంత్రం ఇంటికొచ్చి చూసేసరికి ముగ్గురు కుమార్తెలు కనిపించలేదు. దాంతో స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. బాలికల తండ్రి సోమవారం ఇంట్లోని వస్తువులను వేరే చోటుకు తరలిస్తుండగా, ట్రంక్ పెట్టే సాధారణం కంటే ఎక్కువ బరువు ఉండటం గుర్తించాడు. దాన్ని తెరిచి చూడగా లోపల తప్పిపోయిన ముగ్గురు కుమార్తెలు కనిపించారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.