సిమెంటు లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు స్టూడెంట్లు మృతి

సిమెంటు లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు స్టూడెంట్లు మృతి

విజయవాడ-హైదరాబాద్ హైవేపై ప్రమాదం

సూర్యాపేట, మునగాల, వెలుగు: విజయవాడ– హైదరాబాద్ 65వ నెం బర్ జాతీయ రహదారిపై సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఇందిరా నగర్ వద్ద ముందుగా వెళ్తున్న సిమెంట్ లారీని ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీం పట్నంలోని గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఎనిమిది మంది స్టూడెంట్స్ సోమవారం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని హైదరాబాద్ తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఇందిరానగర్ వద్దకు రాగానే వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ముందుగా వెళ్తున్న సిమెంట్ లారీని వెనుక నుంచి ఢీకొని పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో నగరంలోని చంపాపేటకు చెందిన రేవంత్, బాలాపూర్ కు చెందిన హర్ష అనే  ఇద్దరు స్టూడెంట్స్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయారు. కొత్తపేటకు చెందిన శశాంక్ సూర్యాపేట ఏరియా ఆస్పత్రిలో మృతి చెందాడు. మునగాల ఎస్ఐ సిబ్బందితో అక్కడికి చేరుకొని కారులో ఉన్న వారిని బయటికి తీశారు.

Three students died after being car hits a cement lorry