చెంగిచెర్ల హత్య కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్

చెంగిచెర్ల హత్య కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్

మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధిలోని చెంగిచెర్ల వద్ద జరిగిన మర్డర్ మిస్టరీ ని పోలీసులు చేధించారు. చెంగిచెర్లకి చెందిన దుద్దేల పరమేష్(50) మంగళవారం కొందరు గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్య పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. చెంగిచెర్ల కు చెందిన బొమ్మ వెంకటేష్, సిలవేరు ప్రేమ్ సాయి, సిద్దాల బాను లు ఈ హత్య చేసినట్లు నిర్ధారించారు.  మానసిక స్థితి బాగాలేని పరమేష్.. మంగళవారం రాత్రి తాగిన మత్తులో ఉన్న వెంకటేష్, ప్రేమ్ సాయి, బానులను దూషించాడు. అతని మాటలు విని కోపం పట్టలేకపోయిన ఆ ముగ్గురు పరమేష్ ని హత్య చేశారు. గురువారం ఆ ముగ్గురిని అరెస్టు చేసినట్లు మల్కాజిగిరి డీసీపి రక్షిత మూర్తి తెలిపారు. అరెస్ట్ అనంతరం పోలీసులు ఆ ముగ్గుర్ని రిమాండ్ కి తరలించారు.

Three suspects arrested in Chengicharla murder case