అక్క పుట్టిన రోజునే యాక్సిడెంట్.. చెల్లి మృతి

అక్క పుట్టిన రోజునే యాక్సిడెంట్.. చెల్లి మృతి
  •     స్కూల్ బస్సు కింద పడి చనిపోయిన మూడేండ్ల చిన్నారి 
  •     రంగారెడ్డి జిల్లా యాచారంలోని తులేకుర్దులో విషాదం

యాచారం, వెలుగు  :  అక్క పుట్టిన రోజు నాడే విషాదం జరిగింది. స్కూల్ బస్సు కింద పడి  ఆమె చెల్లి చనిపోయింది. ఈ ఘటన  రంగారెడ్డి జిల్లా యాచారంలో జరిగింది. మండలంలోని తులేకుర్దు గ్రామానికి చెందిన మేకల శివనందు, జ్యోతి దంపతులకు ఇద్దరు కూతుళ్లు  తన్విక, చిన్ను(3) ఉన్నారు. తన్విక ఇబ్రహీంపట్నంలోని టీఆర్ఆర్ స్కూల్​లో ఎల్​కేజీ చదువుతోంది. శుక్రవారం తన్విక పుట్టినరోజు. ఉదయం ఆమె స్కూల్​కు వెళ్లింది. సాయంత్రం స్కూల్​ బస్సులో ఇంటికి వచ్చింది. డ్రైవర్​ బస్సును ఇంటి ముందు ఆపగానే తన్వికను తీసుకెళ్లేందుకు ఆమె తల్లి జ్యోతి ఇంట్లో నుంచి బయటికి వచ్చింది.

ALSO READ: మంత్రాలు చేస్తున్నారని చెట్టుకు కట్టేసిన్రు

అదే టైమ్​లో చిన్న కూతురు చిన్ను కూడా బయటికి వచ్చి బస్సు వెనుక నిల్చుంది. దీన్ని గమనించని డ్రైవర్.. బస్సును రివర్స్​ తీశాడు. బస్సు టైర్ల కింద పడి చిన్ను అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు రోడ్డుపై బైఠాయించి స్కూల్ మేనేజ్​మెంట్​కు  వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బస్సు డ్రైవర్​ను శిక్షించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్  చేశారు.  యాచారం పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.