అయ్యాకొడుకులు ఎవరొచ్చినా మల్కాజ్ గిరిలో ఓడిస్తాం: మంత్రి తుమ్మల

అయ్యాకొడుకులు ఎవరొచ్చినా మల్కాజ్ గిరిలో ఓడిస్తాం: మంత్రి తుమ్మల

అయ్యా కొడుకులు ఎవరొచ్చినా మల్కాజ్ గిరి పార్లమెంట్ లో మా కార్యకర్తను నిలబెట్టి  ఒడిస్తామని సవాల్ విసిరారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.  కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులో ఫిబ్రవరి 29వ తేదీ గురువారం కాంగ్రెస్ పార్టీ  విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి తుమ్మల ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  కేటీఆర్ వచ్చినా.. వాళ్ళ నాయన కేసీఆర్ వచ్చినా మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గంలో గెలుపు కాంగ్రెస్ దేనన్నారు. తెలంగాణలో 17 ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నీళ్లు  నిధులు  నియమాకాల పేరుతో  ఏర్పడిన తెలంగాణను  బీఆర్ఎస్ పార్టీ.. అప్పుల పాలు చేసిందని తుమ్మల ధ్వజమెత్తారు. 

గత ప్రభుత్వం చేసిన అప్పులు తీరుస్తూ.. ప్రతి నెల మొదటి రోజు ఉద్యోగులకు జీతాలు ఇచ్చేలా, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళుతుందని ఆయన చెప్పారు. అహంకారం, అవినీతి, అక్రమాలతో  అన్ని రంగాల్లో తెలంగాణను టిఆర్ఎస్ పార్టీ  ధ్వంసం చేసిందని ఫైర్ అయ్యారు. మల్కాజ్ గిరి పార్లమెంట్ సీటు కాంగ్రెస్ పార్టీ గెలవడం దేశ రాజకీయాల్లో మలుపుకు కారణం అవుతుందన్నారు. 

ALSO READ :- లాస్ట్ డేట్ ఇదే.. ఎంసెట్2024 అప్లై చేస్తున్నారా?

తెలంగాణ రాష్ట్రం కోసం సీఎం రేవంత్ రెడ్డి 18 గంటలు కష్టపడుతున్నారని తెలిపారాయన. ఎన్నికల హామీల్లో భాగంగా ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే నాలుగు అమలు చేశామని మిగిలిన రెండు గ్యారంటీల అమలుకు  కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు మంత్రి తుమ్మల.