లష్కర్ జాతరకు1500 మంది పోలీసుతో టైట్​సెక్యూరిటీ

లష్కర్ జాతరకు1500 మంది పోలీసుతో టైట్​సెక్యూరిటీ

సికింద్రాబాద్​, వెలుగు: ఈ నెల 21, 22 తేదీల్లో జరగనున్న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరలో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మీ పెరుమాళ్ తెలిపారు. వంద సీసీ కెమెరాలతోపాటు 1500 మంది పోలీసులు డ్యూటీ చేస్తారన్నారు. జాతర ఏర్పాట్లపై శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. 

భక్తుల కోసం ఆరు క్యూలైన్లు, బోనాలు తీసుకొచ్చే మహిళలకు, వీఐపీలకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. శివసత్తులకు  మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు సమయం ఇచ్చామని తెలిపారు. ట్రాఫిక్​ డీసీపీ రాహుల్​ మాట్లాడుతూ 9 చోట్ల పార్కింగ్ ఏర్పాటు చేశామన్నారు. 

వీఐపీ వాహనాలు మినహా మిగత వాహనాలను రాణిగంజ్ మార్గంలో అనుమతించబోమన్నారు. అలాగే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. పోలీసులు ఆలయ పరిసరాల్లో ఆంక్షలు విధించడంతో భక్తులు ఇబ్బందులకు గురయ్యారు.