
నిర్భయ దోషులకు మార్చి 3న ఉదయం 6గంటలకు ఉరిశిక్ష అమలుకు పటియాల కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది. ఈ క్రమంలో నిర్భయ దోషులకు తీహార్ జైలు అధికారులు చివరి లేఖను రాశారు. కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు అనుమతిస్తామంటూ లేఖలో అధికారులు తెలిపారు. జైలు నిబంధనల ప్రకారం ఉరి తీయడానికి 14 రోజుల ముందు దోషులను కలుసుకునేందుకు వారి కుటుంబ సభ్యులకు అనమతిస్తారు.
అయితే దోషుల్లో ఇద్దరైన అక్షయ్, వినయ్ మాత్రమే తమ కుటుంబ సభ్యులను కలుస్తామని అధికారులకు చెప్పారట. ముఖేశ్, పవన్ గుప్తా మాత్రం ఫిబ్రవరి 1 డెత్ వారెంట్ కు ముందే తాము కుటుంబ సభ్యులను కలిశామని జైలు అధికారులకు తెలిపారు. నిర్భయ దోషుల్లో ముగ్గురికి అక్షయ్, వినయ్, ముఖేశ్ కు న్యాయపరమైన అవకాశాలు ముగిసిపోయాయి. మరో దోషి పవన్ గుప్తాకు మాత్రం క్యూరేటివ్, క్షమాభిక్ష పిటిషన్లు దాఖలు చేసుకునే ఛాన్స్ ఉంది.
మరోవైపు వినయ్ తన తలను జైల్లోని గోడకు కొట్టుకోవడంతో.. జైలు అధికారులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.