రాష్ట్రంలో కొత్తగా 1,417 కేసులు.. 13 మంది మృతి

రాష్ట్రంలో కొత్తగా 1,417 కేసులు.. 13 మంది మృతి

హైదరాబాద్‌ : రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. గడిచిన 24గంటల్లో కొత్తగా 1,417 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా.. వైర‌స్ తో 13 మంది చ‌నిపోయార‌ని తెలిపింది రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,58,153కు చేరిందని.. తాజాగా మరో 2,479 మంది కోలుకోగా.. 1,27,007 మంది ఇండ్లకు చేరుకున్నారని చెప్పింది. వైరస్‌ ఇప్పటి వరకు 974 మంది మరణించగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 30,532 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని పేర్కొంది. 26,639 మంది హోం ఐసోలేషనల్‌లో ఉన్నట్లు చెప్పింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 34,427 నమూనాలు పరిశీలించగా, మొత్తం 21,69,339 టెస్టులు చేసినట్లు తెలిపింది. ఇంకా 825 శాంపిల్స్‌ ఫలితాలు రావాల్సి ఉందని.. తాజాగా నమోదైన కేసుల్లో హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలో 264, రంగారెడ్డిలో 133, కరీంనగర్‌లో 108, సంగారెడ్డి 107 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని చెప్పింది ఆరోగ్య‌శాఖ‌.