ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ లవర్స్ కోసం ఎన్నో ఓటీటీ యాప్స్ రెడీగా ఉన్నాయి.ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ థియేటర్ల కంటే ఓటీటీపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. థియేటర్స్ దొరకని చిన్న సినిమాలకు ఊపిరిగా నిలుస్తుంది.భాషతో సంబంధం లేకుండా తెలుగు ఓటీటీస్ కూడా చాలా సినిమాలు రిలీజ్ చేస్తున్నాయి. అందులో భాగంగా నేడు (మే9న) రెండు సినిమాలు ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ కు వచ్చాయి.అందులో ఒకటి తెలుగు స్ట్రైట్ ఫిల్మ్ కాగా..మరొకటి తమిళ డబ్బ్డ్ సినిమా.
చిత్రం చూడరా:
హ్యాపీడేస్ చిత్రంతో పదహారేళ్ల క్రితం టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వరుణ్ సందేశ్(Varun Sandesh)..తర్వాత కెరీర్లో సక్సెస్లు అందుకోలేక పోయాడు. ఇటీవల మైఖేల్ మూవీతో తనలోని కొత్త నటుడ్ని పరిచయం చేసిన వరుణ్..ప్రస్తుతం డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాల్లో నటిస్తున్నాడు.
ప్రస్తుతం వరుణ్ చిత్రం చూడరా (Chitramchudara) అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ ఆడియన్స్ లో ఆసక్తి కలిగించింది. వరుణ్ సందేశ్ తో పాటు, ధనరాజ్, కాశీ విశ్వనాథ్ , రవిబాబు నటిస్తున్న ఈ మూవీ నేరుగా గురువారం (మే9న) ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్కు అవుతుంది.
క్రైమ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో వరుణ్ సందేశ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ డై హార్డ్ ఫ్యాన్గా కనిపిస్తున్నాడు.మరి చాలా రోజుల తర్వాత హీరోగా ఎంట్రీ ఇస్తున్న వరుణ్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.
పార్థు (Parthu OTT)
తమిళ బిగ్బాస్ ఫేమ్ సనమ్శెట్టి డీ గ్లామర్ పాత్రలో నటించిన పార్థు మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.ఈ మూవీలో మైఖేల్ తంగదురై, సనమ్శెట్టి హీరోహీరోయిన్లుగా నటించగా..కోలీవుడ్ అగ్ర దర్శకుడు మిస్కిన్ అసిస్టెంట్ అర్జున్ ఎకలవ్యన్ పార్థు మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్, డిటెక్టివ్ నేపథ్యంలో కథ సాగుతుంది.
2 Refreshing stories for this Thursday on ETV WIN.
— BA Raju's Team (@baraju_SuperHit) May 8, 2024
A Win Digital Premiere of Chitram Choodara & Pardhu 🤩
Premieres this Thursday May 9, Only on @etvwin . pic.twitter.com/qnd1TVTYob