హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఎనిమిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రగతి భవన్ నుంచి ఆన్లైన్లో ఒకేసారి వీటిని సీఎం ప్రారంభిస్తారని సీఎంవో ప్రకటించింది. ఈ ఏడాది సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్కర్నూల్, రామగుండంలో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారు. వీటిల్లో 1,150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి.
దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్ల సంఖ్య 2,790కి చేరింది. ఈ కాలేజీలను పూర్తిగా తెలంగాణ ప్రభుత్వమే నిర్మించిందని, కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మంత్రి హరీశ్రావు సోమవారం ట్వీట్ చేశారు.