డీఎస్సీ దరఖాస్తుకు అక్టోబర్ 28న ఆఖరు .. 1.71 లక్షల మంది అప్లై

డీఎస్సీ దరఖాస్తుకు అక్టోబర్ 28న ఆఖరు .. 1.71 లక్షల మంది అప్లై

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డీఎస్సీ దరఖాస్తు గడువు శనివారంతో  ముగియనున్నది. శుక్రవారం సాయంత్రం వరకూ 1,76,599 మంది అభ్యర్థులు ఫీజు చెల్లించగా..అందులో 1,71,564 మంది దరఖాస్తు చేసుకున్నారు. గత నెల 5089 టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. దీంట్లో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టుల కోసం 58,988 మంది దరఖాస్తు చేసుకున్నారు. స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ​27,063, ఎస్ఏ బయోలజికల్ సైన్స్ 21,833,  ఎస్ఏ మ్యాథ్స్  12,159, ఎస్ఏ తెలుగు 10,827, లాంగ్వేజీ పండిట్ తెలుగుకు 9,348 మంది అప్లై చేశారు. అత్యల్పంగా ఎస్జీటీ తమిళ్ మీడియంలో ఒక్కరే దరఖాస్తు చేసుకోగా, మరాఠీ మీడియంలో ఎస్ఏ(ఫిజిక్స్), ఎస్ఏ–మ్యాథ్స్ పోస్టులకు మూడేసి చొప్పున అప్లికేషన్లు వచ్చాయి.