V6 News

రేపు హెచ్ఐసీసీలో స్వాతంత్ర్య వజ్రోత్సవాలు

రేపు హెచ్ఐసీసీలో స్వాతంత్ర్య వజ్రోత్సవాలు

గచ్చిబౌలి, వెలుగు: మాదాపూర్​లోని హెచ్ఐసీసీలో ఈ నెల 8న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న స్వాతంత్ర వజ్రోత్సవాల నేపథ్యంలో ఐటీ కారిడార్​లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ వేడుకలకు సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. దీంతో సోమవారం ఐటీ కారిడార్​లో ట్రాఫిక్ డైవర్షన్ ఉంటుందని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. 

వెహికల్స్ డైవర్షన్ ఇలా..

  • నీరూస్ జంక్షన్ నుంచి గచ్చిబౌలి వెళ్లే వెహికల్స్​ను మాదాపూర్ సీవోడీ జంక్షన్ నుంచి దుర్గం చెరువు, ఇనార్బిట్ మాల్, ఐకియా సెంటర్​, బయోడైవ
  • ర్సిటీ జంక్షన్​ మీదుగా దారి మళ్లించనున్నారు.
  • గచ్చిబౌలి నుండి నీరూస్​ జంక్షన్​ వైపు వచ్చే వెహికల్స్ కూడా ఇదే రూట్​లో రావాల్సి ఉంటుంది.
  • మియాపూర్, హఫీజ్​పేట నుంచి జూబ్లీహిల్స్​ వైపు వచ్చే ట్రాఫిక్​ను కొత్తగూడ, ఏఐజీ హాస్పిటల్​, ఐకియా సెంటర్, ఇనార్బిట్ మాల్, దుర్గం చెరువు మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
  • ఆర్​సీపురం, చందానగర్​ నుంచి మాదాపూర్​, గచ్చిబౌలి వెపు వెళ్లే వెహికల్స్​ను బీహెచ్ఈఎల్,నల్లగండ్ల, హెచ్ సీయూ, ఐఐఐటీ జంక్షన్ మీదుగా దారి మళ్లించనున్నారు. 

ఈ రూట్లలో భారీ వెహికల్స్​కు నో ఎంట్రీ

జేఎన్టీయూ నుంచి సైబర్ టవర్స్ రోడ్, మియాపూర్ నుంచి కొత్తగూడ, కావూరి హిల్స్ నుంచి కొత్తగూడ, బయోడైవర్సిటీ నుంచి సైబర్ టవర్స్ రోడ్, నారాయ
ణమ్మ కాలేజీ నుంచి గచ్చిబౌలి వెళ్లే రూట్లలో భారీ వెహికల్స్​కు అనుమతి లేదని  ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు.