పసుపు ధరలో ట్రేడర్ల కమీషన్.. రైతులకు తప్పని తిప్పలు

పసుపు ధరలో ట్రేడర్ల కమీషన్.. రైతులకు తప్పని తిప్పలు

ఈ సీజన్​లో రూ.20 వేల దాకా పలికిన పసుపు రేటు వ్యాపారుల మాయాజాలంతో క్రమంగా తగ్గిపోతోంది. పసుపు మార్కెట్​కు కేరాఫ్​గా చెప్పుకునే నిజామాబాద్​ గంజ్​లో బుధవారం క్వింటాల్ పసుపు రేట్ రూ.13 వేలు పలకగా, సేమ్​ టైం మహారాష్ట్ర సాంగ్లీలో మాత్రం రూ.16,500 ధర ఉన్నది. నెల కింద ఊహించని రీతిలో సాంగ్లీలో రూ.20 వేలకు మించి రేట్ చెల్లించినా మన దగ్గర మాత్రం ఆ ధర పెట్టలేదు.

పైగా నిజామాబాద్, మెట్​పల్లి లాంటి మార్కెట్లలో  పసుపు కొనే ట్రేడర్లు 2 శాతం కమీషన్​తో పాటు తక్షణ బిల్ పేమెంట్​ పేరుతో ఒకటిన్నర శాతం కోత పెడ్తారు. మహారాష్ట్ర లోని సాంగ్లీలో అసలు కమీషన్, కటింగ్ లేదు. దీంతో ఈ సీజన్​లో చాలా మంది రైతులు మహారాష్ట్రలోని సాంగ్లికి వెళ్లి  పసుపు అమ్ముకుంటున్నారు.