ఈ సీజన్లో రూ.20 వేల దాకా పలికిన పసుపు రేటు వ్యాపారుల మాయాజాలంతో క్రమంగా తగ్గిపోతోంది. పసుపు మార్కెట్కు కేరాఫ్గా చెప్పుకునే నిజామాబాద్ గంజ్లో బుధవారం క్వింటాల్ పసుపు రేట్ రూ.13 వేలు పలకగా, సేమ్ టైం మహారాష్ట్ర సాంగ్లీలో మాత్రం రూ.16,500 ధర ఉన్నది. నెల కింద ఊహించని రీతిలో సాంగ్లీలో రూ.20 వేలకు మించి రేట్ చెల్లించినా మన దగ్గర మాత్రం ఆ ధర పెట్టలేదు.
పైగా నిజామాబాద్, మెట్పల్లి లాంటి మార్కెట్లలో పసుపు కొనే ట్రేడర్లు 2 శాతం కమీషన్తో పాటు తక్షణ బిల్ పేమెంట్ పేరుతో ఒకటిన్నర శాతం కోత పెడ్తారు. మహారాష్ట్ర లోని సాంగ్లీలో అసలు కమీషన్, కటింగ్ లేదు. దీంతో ఈ సీజన్లో చాలా మంది రైతులు మహారాష్ట్రలోని సాంగ్లికి వెళ్లి పసుపు అమ్ముకుంటున్నారు.