
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ లలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఉత్తరాఖండ్లో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. బద్రీనాథ్ హైవేపై 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఉన్నతాధికా రులు స్థానికుల సాయంతో ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ప్రయత్నాలు చేపట్టారు. కాగా, యూపీలో వర్షాలకు పోలీస్ స్టేషన్ పైకప్పు కూలి ఎస్సై చనిపోయారు. ఘజియాబాద్లోని ఏసీపీ ఆఫీసులో శనివారం రాత్రి ఎస్సై వీరేంద్ర కుమార్ మిశ్రా(58) నిద్రపోయారు. ఆదివారం తెల్లవారుజామున పైకప్పు కూలింది. దీంతో ఆయన శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఉదయం శిథిలాలను తొలగించి మిశ్రాను ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు తెలిపారు.