ఇవాళ, రేపు హైదరాబాద్లోని..ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

ఇవాళ, రేపు హైదరాబాద్లోని..ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు సిటీలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు భక్తులు. దీంతో భక్తులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఇవాళా, రేపు(జూలై 21,22, 2024) సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉజ్జయిని మహంకాళి టెంపుల్ కు రెండు కిలోమీటర్ల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. 

కర్బాలా మైదాన్, రాణిగంజ్, రామ్ గోపాల్ పేట్, ఓల్డ్ పీఎస్, పారడైజ్, సీటీవో ప్లాజా, ఎస్బీఐ ఎక్స్ రోడ్, వైఎంసీ ఎక్స్ రోడ్, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ ఎక్స్ రోడ్, ప్యాట్నీ ఎక్స్ రోడ్, పార్క్ లేన్ బాటా, బైబిల్ హౌజ్, మినిస్టర్ రోడ్, రసూల్ పురా వైపు వచ్చే వాహనదారులు  ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. సికింద్రాబాద్ కు వచ్చే ప్రయాణికులను పోలీసులు అలర్ట్ చేశారు. స్టేషన్ లోకి ప్లాట్ ఫాం నంబర్ 1 నుంచి కాకుండా ప్లాట్ ఫాం నంబర్ 10 నుంచి లోపలికి  చేరుకోవాలని ప్రయాణికులకు సూచించారు. 

ఇక బోనాల జాతర సందర్భంగా టోబాకో బజార్ నుంచి మహంకాళి టెంపుల్ కు వచ్చే రోడ్ ,బాటా ఎక్స్ రోడ్ నుంచి రాంగోపాల్ పేట  పీఎస్ వరకు, జనరల్ బజార్ రోడ్, ఆదయ్య ఎక్స్ రోడ్ మూసివేయనున్నారు.