ఇంటిముందు ఆడుకుంటున్న 8ఏళ్ల బాలుడి కిడ్నాప్..

ఇంటిముందు ఆడుకుంటున్న 8ఏళ్ల బాలుడి కిడ్నాప్..
  • ఉరివేసి చంపి బావిలో పడేశారు

మహబూబ్ నగర్: జిల్లాలోని మూసాపేట మండలం జానంపేట గ్రామంలో దారుణం జరిగింది. 3 రోజుల క్రితం అంటే ఈనెల 22వ తేదీన ఇంటిముందు ఆడుకుంటున్న సతీష్ (8) అనే బాలుడిని దుండగులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు లక్ష్మమ్మ, విష్ణు  చుట్టు పక్కల అన్నిచోట్ల వెతికారు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసి గాలింపు కొనసాగిస్తున్నారు. అయితే ఈరోజు చిన్నారి సతీష్ శవం బావిలో బయటపడింది. గొంతునులిమి హత్య చేసినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. తమపై అసూయతో ఓర్వలేక తమ దాయాదులే ఘాతుకానికి ఒడిగట్టి ఉంటారని చిన్నారి తండ్రి విష్ణు, తల్లి లక్ష్మమ్మ విలపించడం స్థానికులను కంటతడిపెట్టించింది.

ఇవి కూడా చదవండి 

పిల్లల్ని బడికి తీసుకెళ్లినట్లే గ్రౌండ్‌కు తీసుకెళ్లాలి

కిడ్నాప్ డ్రామా ఆడిన బీఫార్మసీ యువతి సూసైడ్

పక్షులకు కేరాఫ్ ఈ ఇల్లు

పన్నెండేళ్ల  పిలగాడు.. చిరుతతో ఫైటింగ్