మాజీ ప్రధానమంత్రి లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ప్రముఖులు ఘనంగా నివాళి అర్పించారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ లాల్ బహుదూర్ శాస్త్రికి నివాళి అర్పించారు. విజయ్ ఘాట్లోని శాస్త్రి సమాధి వద్ద మోడీ పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు.
కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. విజయ్ ఘాట్ కు వెళ్లి నివాళి అర్పించారు. దేశానికి లాల్ బహుదూర్ శాస్త్రీ చేసిన సేవలను స్మరించుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా శాస్త్రి కి నివాళులర్పించారు.