టెస్టులు పెంచాలన్నందుకు గవర్నర్ పై ఎదురుదాడి

టెస్టులు పెంచాలన్నందుకు గవర్నర్ పై ఎదురుదాడి
  • కేసీఆర్ ఆర్మీ’పేరుతో చిల్లర పోస్టులు
  •  ట్వీట్ చేసి తొలగించిన ఎమ్మెల్యే సైదిరెడ్డి
  •  పరువు తీసుకున్నటీఆర్ఎస్..పార్టీ తీరుపైజనం ఫైర్
  •  కరోనాపై సర్కార్ చేతులెత్తేయడంతో గవర్నర్ చొరవ
  •  ఎప్పటికప్పుడు జనం గోడువింటున్నతమిళిసై
  •  సీఎస్,హెల్త్ సెక్రటరీని రాజ్ భవన్ కు పిలిచి మీటింగ్
  •  వైరస్ పై అలర్ట్ చేసినా ఏమాత్రం పట్టించుకోని సర్కార్

ఎవరేం మంచిమాట చెప్పినా.. రాష్ట్ర ప్రభుత్వం ఓర్చుకోలేకపోతోంది. తప్పులను వేలెత్తి చూపే వాళ్లను సహించ లేకపోతోంది. కరోనా టెస్టులు పెంచి.. ప్రజలను వైరస్ నుంచి కాపాడాలని సూచించినందుకు రాష్ట్ర గవర్నర్ పైనే రాజకీయంగా అధికార పార్టీ దాడికి దిగింది. ఎక్కువ టెస్టులు చేయకుంటే కరోనాను అరికట్టడం కష్టమేనని గవర్నర్ చేసిన సూచనను ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఏకంగా కొందరు టీఆర్ఎస్ నేతలు గవర్నర్ కు  వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇంకొందరు ‘కేసీఆర్ ఆర్మీ’ పేరుతో చిల్లర పోస్టులు వైరల్ చేశారు.

గవర్నర్ పట్ల టీఆర్ఎస్ వ్యవహరిస్తున్నతీరు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఫెయిల్యూర్స్ ను ఎత్తిచూపితే సరిదిద్దుకోకుండా ఎదురు దాడి చేయడం ఏమిటని ఇటు ప్రజలు, అటు ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. గవర్నర్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తమిళి సై ప్రతివిషయంలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. తన దగ్గరకు వచ్చిన వినతులను ప్రభుత్వానికి పంపిస్తున్నా రు. కరోనా బాధితుల దగ్గరకు, వారియర్స్ దగ్గరకు వెళ్లి ధైర్యం నింపుతున్నారు. ఈ విషయాలన్నీ మరిచిపోయి గవర్నర్ ను అధికార పార్టీటార్గెట్  చేయడం వెనుక ఆంతర్యం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

గవర్నర్ తమిళిసై బీజేపీ చీఫ్ లా వ్యవహరిస్తున్నారం టూ హుజూర్నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి బుధవారం రాత్రి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్తో గవర్నర్ పై టీఆర్ఎస్ ఎదురుదాడికి సిద్ధమైందన్న సంకేతాలు వెళ్లాయి . సీఎం కేసీఆర్ డైరక్షన్ తోనే సైదిరెడ్డి పోస్ట్ పెట్టినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. గవర్నర్ చేసిన సలహాలను అర్థం చేసుకోకుండా ఎటాక్ చేయడం ఏమిటని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నించారు. దీంతో రాజకీయంగా ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రమాదం ఉందని గ్రహించిన ఎమ్మె ల్యే సైదిరెడ్డి.. గురువారం పొద్దున్నే ట్వీట్ ను డిలీట్ చేశారు.

సూచనలు చేసినా.. ఆరు లేఖలు రాసినా..

రాష్ట్రంలో కరోనా ఉధృతిని ముందే గ్రహించిన గవర్నర్.. దాన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వానికి అనేక సూచనలు చేశారు. ఆరు లేఖలు రాశారు. టెస్టుల సంఖ్యను పెంచాలని కోరారు. జిల్లా హాస్పిటల్స్ లో కూడా కరోనా ట్రీట్మెంట్ ప్రారంభించాలని చెప్పారు. చాలా చోట్ల హెల్త్ స్టాఫ్ కొరత ఉందని గ్రహించిన గవర్నర్.. అవసరమైన స్టాఫ్ను రిక్రూట్ చేయాలన్నారు. దాదాపు 7 వేల మంది డాక్టర్లు, 20 వేల మంది నర్సులను భర్తీ చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ట్రీట్మెంట్ కోసం బెడ్ల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పేందుకు రాజ్ భవన్ కు వచ్చిన సీఎం కేసీఆర్ కు కరోనా కట్టడిపై గవర్నర్ తమిళిసై అనేక సూచనలు చేసినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో పరిస్థి తిని సమీక్షించేందుకు జులై 6న సీఎస్,హెల్త్ సెక్రటరీని రాజ్ భవన్ కు రావాలని గవర్నర్ ఆదేశించగా.. తాము మరో పనిలో ఉన్నామంటూ గవర్నర్ ఆదేశాలను సీఎస్ పక్కన పెట్టారు. 24 గంటల తర్వాత రాజ్ భవన్ కు వెళ్లారు. సీఎం ఆర్డర్ మేరకే ఫస్ట్ డే రాజ్ భవన్ కు సీఎస్ వెళ్లలేదని అప్పట్లోరాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. గవర్నర్ సూచనలను ప్రభుత్వం పక్కన పెట్టడమే కాకుండా.. ఇప్పుడు రాజకీయంగా ఎదురుదాడికి టీఆర్ఎస్ దిగుతోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

జనానికి అందుబాటులో గవర్నర్ కరోనా బాధితులను పరామర్శించేందుకు, వారియర్స్లో భరోసా నింపేందుకు ఐదు నెలలుగా సీఎం కేసీఆర్ ఒక్క హాస్పిటల్కు కూడా వెళ్లలేదు. కానీ డాక్టరైన తమిళిసై గవర్నర్ హోదాలో జనం గోడునువింటున్నారు. కరోనాపై ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. కరోనా బాధితులు, వారియర్స్కు భరోసా కల్పించేందుకు ఆమె నిమ్స్, ఈఎస్ఐ హాస్పిటళ్లను సందర్శించారు. అక్కడ ట్రీట్మెంట్ తీరును పరిశీలించారు. బాధితులు, డాక్టర్లతో మాట్లాడి ధైర్యం నింపారు. మిగతా హాస్పిటల్స్ లో అందుతున్న కరోనా ట్రీట్మెంట్ను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ప్రైవేటు హాస్పిటళ్లు అడ్డగోలు ఫీజులు వసూలు చేస్తున్నాయంటూ వచ్చిన వార్తలకు ఆమె స్పందించారు. ప్రైవేటు హాస్పిటల్స్ మేనేజ్మెంట్లతో వెబ్ కాన్ఫరెన్స్ నిర్వహించి.. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ట్రీట్మెంట్ అందించాలన్నారు. ట్విట్టర్ వేదికగా ఆమె ప్రజల సమస్యలను విని.. ఓపికగా సమాధానాలు ఇచ్చారు.

‘‘కాంటాక్ట్ ట్రేసింగ్ చేయడం లేదు,

హైదరాబాద్ లో కేసులు విపరీతంగా పెరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. బెడ్స్ లేవని హాస్పిటల్స్ అంటున్నాయి’’.. అని ప్రజలు గోడు వెళ్లబోసుకోగా.. వాటన్నింటినీ నోట్ చేసుకుంటున్నట్టు గవర్నర్ చెప్పారు. వచ్చిన ఫిర్యాదులు, సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు.

‘కేసీఆర్ ఆర్మీ’ పై రాజ్ భవన్ సీరియస్

గవర్నర్ కు వ్యతిరేకంగా ‘కేసీఆర్ ఆర్మీ’ పేరుతో సోషల్ మీడియా వేదికగా కొందరు పోస్టులు పెడుతున్నారు. ఈ విషయంపై రాజ్ భవన్ సీరియస్ గా ఉన్నట్టుతెలిసింది. అసలు ‘కేసీఆర్ ఆర్మీ’ అనే గ్రూపు ను ఎవరు నడిపిస్తున్నారు? ఆ వ్యక్తులు ఎవరు?.. అని రాజ్ భవన్ వర్గాలు ఆరా తీస్తున్నట్టు సమాచారం. రాష్ట్రంలో టెస్టులు పెంచాలని గవర్నర్ ట్వీట్ చేసిన అంశంపై కేసీఆర్ ఆర్మీ.. ‘గవర్నర్ పదవి రాజ్యాంగ వ్యవస్థ. దాన్ని రాజకీయ వ్యవస్థగా మార్చారు’ అని పోస్టు చేసింది.