ముందు మావోళ్లకే దళితబంధు అంటున్న లీడర్లు

ముందు మావోళ్లకే దళితబంధు అంటున్న లీడర్లు

హైదరాబాద్: దళితబంధు స్కీమ్ లో మొదట తమ కార్యకర్తలకే ప్రయారిటీ ఇస్తామంటున్నారు ఎమ్మెల్యే అబ్రహం. అందరికీ ఇస్తామంటూనే పార్టీకి పనిచేశారు కాబట్టి కొందరు కార్యకర్తలకు ఫస్ట్ ఫేజ్ లో దళితబంధు ఇచ్చినట్లు తెలిపారు. మొదటి నుంచి దళితబంధు స్కీమ్ టీఆర్ఎస్ కార్యకర్తలకు ఇస్తున్నారని విమర్శలు ఉన్నాయి. మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా.. నిన్న ఖానాపురంలో మాట్లాడుతూ తమ పార్టీ వాళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నామని తేల్చి చెప్పారు. ప్రతిపక్ష లీడర్లు ఎవరెన్ని విమర్శలు చేసినా పార్టీ కార్యకర్తలకే ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు పెద్ది సుదర్శన్ రెడ్డి. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఉండాలంటే కార్యకర్తలకు ప్రభుత్వ పథకాలు మొదటగా అందేలా చూస్తామన్నారు. దళితబంధు టీఆర్ఎస్ కార్యకర్తలకే ఇస్తున్నారని ఈ మధ్యే చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యను అడ్డుకున్నారు దళితులు. అయితే బరాబర్ పార్టీ కార్యకర్తలకు దళితుబంధు స్కీమ్ లో ప్రాధాన్యత ఇస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముందే తేల్చి చెప్పారు ఎమ్మెల్యే కాలె యాదయ్య. 

 

 

ఇవి కూడా చదవండి

సిమ్‌కార్డు తీసుకునేవారికి కొత్త నిబంధనలు

ప్రభుత్వ స్కూళ్లలో కార్పొరేట్ విద్య

పుతిన్ తలపై రివార్డు ప్రకటించిన రష్యా బిజినెస్ మ్యాన్