టీఆర్ఎస్ పాలనతో జనం విసిగిపోయిన్రు

టీఆర్ఎస్ పాలనతో జనం విసిగిపోయిన్రు

టీఆర్ఎస్ పాలనతో విసిగిపోయిన యువ కార్యకర్తలు బీజేపీ పార్టీలో చేరుతున్నారని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. పెద్దపల్లి మండలం అందుగులపల్లితో పాటు ధర్మపురి నియోజకవర్గంలోని కుమ్మరిపల్లె గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కుమ్మరిపల్లె గ్రామానికి చెందిన పలువురు టీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు వివేక్ సమక్షంలో బీజేపీలో చేరారు. వారందరికీ ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

సీఎం కేసీఆర్ పాలన అవినీతిమయంగా మారిందని, అందుకే ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని యువత కంకణం కట్టుకుందని వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇచ్చిన హామీలను అమలుచేయని పార్టీని వీడి యువత బీజేపీలో చేరేందుకు మొగ్గుచూపుతోందని చెప్పారు. మోడీ పాలనను మెచ్చి వారంతా తమ పార్టీలో చేరుతున్నారని  అన్నారు. జూలై 3న పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే మోడీ సభకు భారీ ఎత్తున జనం తరలిరావాలని వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు.