టీచర్ల బదిలీలపై అక్టోబర్ 19వరకు హైకోర్టు స్టే

టీచర్ల బదిలీలపై అక్టోబర్ 19వరకు హైకోర్టు స్టే

రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు మళ్లీ బ్రేక్ పడింది. స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల బదిలీలను అక్టోబర్ 19 వరకు హైకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతుల తర్వాతే బదిలీలు చేయాలని రంగారెడ్డి జిల్లా టీచర్ల తరపున దాఖలైన పిటిషన్ ను శుక్రవారం(అక్టోబర్ 06) జస్టిస్ జువ్వాడి శ్రీదేవి బెంచ్ విచారణ చేసింది. 

ఈ క్రమంలో పిటిషనర్ల తరపున న్యాయవాది బాలకిషన్ రావు వాదనలు వినిపించారు. వాదనలు విన్న జస్టెస్ జువ్వాడి శ్రీదేవి.. టిచర్ల బదిలీ అక్టోబర్ 19 వరకు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.