సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి అసౌకర్యం కలగకుండా టీఎస్ఆర్టీసీ పకడ్బందీ ఏర్పాట్లు చేసిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. హైదరాబాద్ లోని ప్రధాన రద్దీ ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం పండల్స్, షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, తాగునీరు, మొబైల్ టాయిలెట్ల సుదుపాయం కల్పించిందని చెప్పారు.
ప్రధాన ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్లైన ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్ లలో కొత్తగా 36 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసిందని స్పష్టం చేశారు. వాటిని బస్ భవన్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేసిందని వివరించారు. ఈ సీసీటీవీ కెమెరాల ద్వారా ప్రయాణికుల రద్దీని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారని.. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతున్నారని సజ్జనార్ చెప్పారు.