బంగారం తరలింపులో టీటీడీకి సంబంధం లేదు: చల్లా బాబు

బంగారం తరలింపులో టీటీడీకి సంబంధం లేదు: చల్లా బాబు

చెన్నైలో పట్టుబడిన 1381 కేజీల బంగారం పై టీటీడీ పాలకమండలి స్పందించింది. బంగారు తరలింపు పై పంజాబ్ నేషనల్ బ్యాంక్ ముందస్తు గానే ఎన్నికల అధికారులుకు సమాచారం అందించారని టి.టి.డి బోర్డు మెంబర్ చల్లా బాబు తెలిపారు. తరలింపు సమయంలో బ్యాంకు అధికారులు సరైన పత్రాలను చూపకపోవడంతో సీజ్ చేసారని అన్నారు. బంగారం తరలిపులో టీటీడీకి ఎలాంటి భాద్యత లేదని ఆయన అన్నారు. త్వరలోనే పాలకమండలి సమావేశం నిర్వహించి, లోపాలు సరిదిద్ది, బాధ్యులు వుంటే చర్యలు తీసుకుంటామన్నారు చల్లా బాబు.