ఇండియాలో బిట్​కాయిన్​ను డెవలప్ చేస్తాం

ఇండియాలో బిట్​కాయిన్​ను డెవలప్ చేస్తాం
  • ఇండియాలో బిట్​కాయిన్​ను డెవలప్ చేస్తాం
  • ఇందుకోసం 500 బిట్​ కాయిన్లు ఇస్తా
  • ట్విటర్​ సీఈఓ జాక్ డోర్సీ ప్రకటన

న్యూఢిల్లీ: క్రిప్టో​ కరెన్సీ ‘బిట్​కాయిన్’​కు ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ పాపులారిటీ పెరుగుతున్న సమయంలో, ఇండియా, ఆఫ్రికాలో బిట్​కాయిన్ డెవలప్​మెంట్​ కోసం బీట్రస్ట్​ను ఏర్పాటు చేస్తామని ట్విటర్​ సీఈఓ జాక్​ డోర్సీ ప్రకటించారు. ఇంటర్నెట్​లో ట్రాన్సాక్షన్లకు బిట్​కాయిన్​ను వాడేలా చేస్తామని చెప్పారు. ఇందుకోసం అమెరికా బిజినెస్​ మ్యాన్​ షాన్​ కోరేతో చేతులు కలుపుతున్నట్టుపేర్కొన్నారు. వీళ్లిద్దరూ ట్రస్ట్​కు 500 బిట్​కాయిన్లు ఇస్తారు. టెస్లా చీఫ్​ఎలన్​ మస్క్​తోపాటు మాస్టర్​కార్డ్​, పేపాల్​ వంటి కంపెనీలు​ కూడా ఈ క్రిప్టోకరెన్సీ పేమెంట్లను అంగీకరిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. తామూ నేషనల్​ క్రిప్టోకరెన్సీ తెస్తామని ఇటీవల కేంద్రం ప్రభుత్వం వెల్లడించింది. అయితే తమ బిజినెస్​ను మొదలుపెట్టడానికి ముగ్గురు బోర్డు మెంబర్లు అవసరమని, ఆసక్తి ఉన్న వాళ్లు తమకు అప్లికేషన్లు అందజేయవచ్చని డోర్సీ కోరారు. బిట్​కాయిన్​ను ఇంటర్నెట్​ కరెన్సీగా మార్చడమే తమ టార్గెట్​ అని ప్రకటించారు. ఈ ట్రస్టుకు తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోమని, అదే అన్ని నిర్ణయాలను తీసుకుంటుందని చెప్పారు.

ప్రస్తుతం ఒక్కో బిట్​కాయిన్ 49,500 డాలర్ల వద్ద ఎక్సేంజీల్లో ట్రేడ్​ అవుతోంది. క్రిప్టో కరెన్సీలకు డిమాండ్​ పెరుగుతూనే ఉండటంతో చైనా, ఇండియా వంటి దేశాలు కూడా డిజిటల్ కరెన్సీ తీసుకురావడానికి ప్రయత్నాలను మొదలుపెట్టాయి. ఈ బడ్జెట్​ సెషన్​లోనే ‘క్రిప్టోకరెన్సీ అండ్​ రెగ్యులేషన్​ ఆఫ్​ అఫీషియల్​డిజిటల్​ కరెన్సీ బిల్​ 2021’ను ప్రవేశపెడతామని ఇండియా ప్రకటించింది. దీనివల్ల ఆర్​బీఐ డిజిటల్​మనీని తీసుకురావడం సాధ్యపడుతుంది. చైనా తన డిజిటల్​ యువాన్​ను టెస్ట్ చేస్తోంది. అయితే బీట్రస్ట్​బోర్డుకు మెంబర్లు కావాలని డోర్సీ ప్రకటించగానే, వజీర్​ఎక్స్​ సీఈఓ నిశ్చల్​ శెట్టి, బైనాన్స్​ సీఈఓ చాంగ్​పెంగ్ ఝావో వంటి వారి పేర్లను ట్విటర్​ యూజర్లు నామినేట్​ చేశారు. రతన్​ టాటా అయితే బాగుంటుందని మరికొందరు సూచించారు. ఇండియాలో బిట్​కాయిన్ వాడకం పెరిగితే ఎకానమీకి ఎంతో మేలు జరుగుతుందని నిశ్చల్​ అన్నారు.

బిట్​కాయిన్​ను తప్పకుండా కొనండి- జెఫరీస్​సీనియర్​ ఎగ్జిక్యూటివ్ క్రిస్టఫర్​వుడ్​

బిట్​కాయిన్ రేటు తగ్గినప్పుడల్లా దానిని కొంటూనే ఉండాలని జెఫరీస్​హెడ్​ ఆఫ్​ ఈక్విటీ స్ట్రాటజీ క్రిస్టఫర్​వుడ్​ సూచించారు. ఈ క్రిప్టోకరెన్సీ విలువ మరింత పెరుగుతుందని చెప్పారు. బిట్​కాయిన్లు కొనడానికి గోల్డ్​లో ఆయన తన ఇన్వెస్ట్​మెంట్లను తగ్గించుకున్నారు కూడా.

For More News..

ఒలింపిక్స్‌‌కు మరో ముగ్గురు ఇండియన్ రేస్‌‌ వాకర్స్‌‌

మేయర్ ఫ్లెక్సీలు పెట్టినందుకు రూ.3 లక్షల ఫైన్

భర్త రెండో భార్యను చంపిన మొదటి భార్య