- 17 టూవీలర్లు స్వాధీనం
జీడిమెట్ల, వెలుగు: బైక్లను ఎత్తుకెళ్తున్న ఇద్దరు దొంగలతో పాటు వాటిని కొంటున్న వ్యక్తిని పేట్బషీరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. మేడ్చల్ సీఐ ప్రశాంత్, డీఐ రాజుతో కలిసి డీసీపీ శబరీష్ బుధవారం వివరాలు వెల్లడించారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేటకి చెందిన మన్నె మహేశ్ అలియాస్ మహేందర్ (23), షేక్ అమీర్ ఇద్దరూ ఫ్రెండ్స్.
వీరిద్దరు కలిసి బైక్ లను దొంగలించి అదే గ్రామానికి చెందిన తోగారి రాజు(22)కు అమ్మేవారు. వీరు పేట్ బషీరాబాద్, జీడిమెట్ల, అల్వాల్, మేడ్చల్, జిన్నారం, శంకరంపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో 17 బైక్లను దొంగిలించారు. బుధవారం పేట్ బషీరాబాద్ పోలీసులు కొంపల్లి చౌరస్తాలో తనిఖీలు చేపట్టారు. బైక్పై వస్తున్న మహేశ్, రాజును అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా.. బైక్ దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. మహేశ్, రాజుతో పాటు అమీర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.8 లక్షల 50 వేల విలువైన 17 బైక్ లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించారు.