సాఫ్ట్వేర్ ఉద్యోగి కిడ్నాప్ కేసులో ఇద్దరు అరెస్ట్

సాఫ్ట్వేర్ ఉద్యోగి కిడ్నాప్ కేసులో ఇద్దరు అరెస్ట్

రాయదుర్గం పోలీస్టేషన్ పరిధిలో కలకలం రేపిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి సురేందర్ బాబును ఈరోజు(జనవరి 6) కర్నూల్ లో గుర్తించారు పోలీసులు. ఈ కేసులో ఇద్దరు కిడ్నాపర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. రాయదుర్గం పీఎస్ లో ఇద్దరు కిడ్నాపర్లను విచారిస్తున్నారు పోలీసులు. 

ఏం జరిగిందంటే..  

హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి కిడ్నాప్ కు గురైన ఘటన కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు ఐటీ ఉద్యోగి గుర్రం సురేంద్ర బాబును జనవరి 4న సాయంత్రం కిడ్నాప్ చేశారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కేర్ ఆసుపత్రి దగ్గర కిడ్నాప్ జరిగింది. కారులో వచ్చిన దుండగులు బాధితుడిని తీసుకెళ్లారు. 

బాధితుడి భార్యకు ఇంటర్నెట్ ద్వారా కాల్ చేసిన దుండగులు.. 50 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో కిడ్నాపర్ల కోసం పోలీసులు నిన్నటి నుంచి గాలించారు. ఈ క్రమంలోఇవాళ కర్నూలులో సురేందర్ బాబును గుర్తించారు. ఇద్దరు కిడ్నాపర్లను అరెస్టు చేశారు. రాయదుర్గం పీఎస్ లో ఇద్దరు కిడ్నాపర్లను విచారిస్తున్నారు పోలీసులు.