మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం పోచంపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వాగు దాటుతుండగా ఇద్దరు అన్నదమ్ముల్లు వరదలో కొట్టుకుపోయారు. మృతులను పోచంపల్లి గ్రామానికి చెందిన పిండి శ్రీను, పిండి యకయ్యగా గుర్తించారు. పిండి శ్రీను మృతదేహం దొరకగా..పిండి యకయ్య మృతదేహం కోసం గ్రామస్తులు గాలిస్తున్నారు. మేనమామ దిశదిన కర్మకు తిరుమలగిరికి వెళ్లి వస్తుండగా పోచంపల్లి గ్రామ శివారులో ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరన్నదమ్ముల మృతితో ఆ కుటుంబంలో,గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు పడుతున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులు ప్రమాదకరస్థాయికి చేరాయి. చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. వందలాది గ్రామాలు వరదలో చిక్కుకున్నాయి. ఇండ్లన్నీ నీట మునిగిపోవడంతో సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.