పొలంలో ఇద్దరమ్మాయిలు మృతి.. ఒకరి పరిస్థితి విషమం

పొలంలో ఇద్దరమ్మాయిలు మృతి.. ఒకరి పరిస్థితి విషమం

ఉత్తరప్రదేశ్ లో మరో దారుణం జరిగింది. ఉన్నావ్ జిల్లా బబురహ గ్రామంలోని పంట పోలాల్లో ముగ్గురు అమ్మాయిలు అపస్మారక స్థితిలో పడిపోయి కనిపించారు. వెంటన హాస్పిటల్ కు తరలించగా ఇద్దరు అమ్మాయిలు చనిపోయినట్లు డాక్టర్లు నిర్దారించారు. మరో అమ్మాయి పరిస్థితి విషమంగా ఉందన్నారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు పశువుల మేత కోసం వెళ్లిన అమ్మాయిలు సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాలేదు. పోలం దగ్గరకు వెళ్లి చూడగా అపస్మారక స్థితిలో కనిపించారని చెప్పారు కుటుంబ సభ్యులు. అమ్మాయిల కాళ్లు, చేతులు కట్టి ఉన్నాయన్నారు. వెంటనే హాస్పిటల్ కు తరలించగా ఇద్దరు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్దారించారు. అమ్మాయిలపై విష ప్రయోగం జరిగి ఉంటుందని డాక్టర్లు  అనుమానిస్తున్నారు.

see more news

రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు