కూకట్​పల్లి డ్రగ్స్​ కేసులో మరో కానిస్టేబుల్... ఇద్దరిని తిరుపతిలో అరెస్ట్​ చేసిన పోలీసులు

కూకట్​పల్లి డ్రగ్స్​ కేసులో మరో కానిస్టేబుల్... ఇద్దరిని తిరుపతిలో అరెస్ట్​ చేసిన పోలీసులు

కూకట్​పల్లి, వెలుగు: కూకట్​పల్లిలో ఇటీవల రూ.కోటి విలువైన డ్రగ్స్​ను విక్రయించేందుకు ప్రయత్నించిన ఐదుగురు సభ్యుల ముఠాను ఎస్​ఓటీ పోలీసులు వల పన్ని పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ డ్రగ్స్​ కేసులో ప్రధాన నిందితుడైన తిరుపతికి చెందిన ఒక కానిస్టేబుల్​ పరారీలో ఉన్నారని ఆ సమయంలో పోలీసులు తెలిపారు. అయితే ఈ కేసు మరో మలుపు తిరిగింది. డ్రగ్స్​ ముఠాలో తిరుపతికి చెందిన మరో కానిస్టేబుల్ కూడా ప్రధాన పాత్ర పోషించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. 

డ్రగ్స్​ సరఫరాలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న తిరుపతికి చెందిన టాస్క్​ఫోర్స్​ కానిస్టేబుల్​ గుణశేఖర్​తో పాటు మరో హెడ్​ కానిస్టేబుల్​ రామచంద్రను కూడా కూకట్​పల్లి పోలీసులు తిరుపతిలో అరెస్ట్​ చేసి నగరానికి తీసుకువస్తున్నట్లు సమాచారం. 

ఈ ఇద్దరితో పాటు డ్రగ్స్​ విక్రయం వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనేది చర్చనీయాంశంగా మారింది. కోట్ల రూపాయల విలువైన ఎపిడ్రిన్​, హెరాయిన్​ డ్రగ్స్​ను కలిపి విక్రయించటం సాధారణమైన విషయం కాదని, దీని వెనుక పెద్ద ముఠానే ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.