తండ్రి తిట్టిండని ఇంట్లో  నుంచి వెళ్లిపోయిన అక్కాచెల్లెళ్లు

తండ్రి తిట్టిండని ఇంట్లో  నుంచి వెళ్లిపోయిన అక్కాచెల్లెళ్లు


గచ్చిబౌలి,వెలుగు:   అక్కాచెలెళ్లు మిస్సింగ్ ఘటన రాయదుర్గం పీఎస్ పరిధిలో జరిగింది. మణికొండ కేపీఆర్ కాలనీకి చెందిన భీమల్ సాహీ సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్. పెద్ద కుమార్తె శ్రేయ షాహీ(20) బీటెక్ చదువుతోంది. చిన్న కుమార్తె శాన్య షాహీ(18) ఇంటర్ పూర్తి చేసింది. సోషల్ మీడియా మోజులో పడి చదువును నిర్లక్ష్యం చేస్తున్నారని భీమల్ సాహీ ఇటీవల తన కూతుళ్లను మందలించాడు. దీంతో శ్రేయ, శాన్య ఇద్దరూ సోమవారం ఇంట్లో నుంచి బయటికెళ్లి తిరిగిరాలేదు. భీమల్  కూతుళ్ల కోసం చుట్టుపక్కలవెతికినా ఆచూకీ దొరకలేదు.  దీంతో సాయంత్రం రాయుదర్గం పోలీసులకు కంప్లయింట్ చేశాడు.