ఇండియాలో ఉబర్ మొదటి డేటా సెంటర్‌‌‌‌...

ఇండియాలో ఉబర్ మొదటి డేటా సెంటర్‌‌‌‌...
  • అదానీ గ్రూప్‌‌ తో కలిసి ఏర్పాటు చేసే ఆలోచన

న్యూఢిల్లీ: క్యాబ్‌‌ సర్వీస్‌‌లను అందించే  గ్లోబల్‌‌ కంపెనీ  ఉబర్,  తమ మొదటి డేటా సెంటర్‌‌‌‌ను అదానీ గ్రూప్‌‌తో కలిసి ఇండియాలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.  అహ్మదాబాద్‌‌లో గౌతమ్ అదానీని కలిసిన  తర్వాత ఉబర్ సీఈఓ దారా ఖోస్రోషాహి ఈ విషయాన్ని ఎక్స్‌‌ ద్వారా పేర్కొన్నారు. 

ఈ కొత్త డేటా సెంటర్  సాయంతో తమ టెక్నాలజీని టెస్ట్, అమలు చేస్తామని తెలిపారు. ఈ సెంటర్ ఈ ఏడాది చివరిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 

"భారత్ నుంచి ప్రపంచం కోసం"  అనే నినాదంతో భారీ స్థాయిలో కార్యకలాపాలను నిర్మించడానికి ఈ పెట్టుబడి దోహదపడుతుందని దారా పేర్కొన్నారు.