ప్రస్తుత సమాజంలో ఉగ్రవాదానికి చోటు లేదు

ప్రస్తుత సమాజంలో ఉగ్రవాదానికి చోటు లేదు

ఉగ్రవాదంపై ప్రతీదేశం పోరాడాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో పిలుపునిచ్చారు. ముంబైలో పర్యటిస్తున్న ఆయన ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి తాజ్ హోటల్ లోని స్మారక మ్యూజియం దగ్గర నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ పాల్గొన్నారు.

ఉగ్రవాదానికి ప్రస్తుత సమాజంలో చోటు లేదని ఆంటోనియో అన్నారు. ముంబై 2011 దాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయినవారంతా రియల్ హీరోలన్నారు. వారి కుటుంబసభ్యులకు ఆంటోనియా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.