పని ఒత్తిడి తట్టుకోలేక చార్టర్డ్ అకౌంటెంట్ ఆత్మహత్య

పని ఒత్తిడి తట్టుకోలేక చార్టర్డ్ అకౌంటెంట్ ఆత్మహత్య

హైదరాబాద్: పని ఒత్తిడి తట్టుకోలేక చార్టర్డ్ అకౌంటెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం(జూన్18) హీలియం గ్యాస్ పీల్చుకొని సూసైడ్ చేసుకున్న ఘటన గచ్చిబౌలి పోలిస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే.. 

మణికొండలోని ఓ ప్రైవేట్ కంపెనీలో చార్టర్డ్ అకౌంటెంట్ గా జాబ్ చేస్తున్న సురేష్ రెడ్డి (28) బుధవారం కొండాపూర్ రాజేశ్వరీ కాలనీలో సర్వీస్ అపార్టుమెంట్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. జూన్ 16న తన చెల్లెలి ఇంటికి పోతున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లిన సురేష్ రెడ్డి..బుధవారం రాజేరాజేశ్వరి కాలనీలోని తన రూంలో  హీలియం గ్యాస్ లీక్ చేసి ఊరిరాడకుండా తలకు కవర్ కట్టుకొని బలవన్మరణానికి తెలుస్తోంది. సురేష్ రెడ్డి రూంలో హీలియం గ్యాస్ సిలిండర్, సూసూడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.  

పనిఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ లో సురేష్ రెడ్డి రాసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.