
సౌరాష్ట్ర: ఇండియా పేసర్ జైదేవ్ ఉనాద్కట్ 2023ని అరుదైన రికార్డుతో ఆరంభించాడు. సౌరాష్ట్ర తరఫున రంజీ ట్రోఫీ ఆడుతున్న ఉనాద్కట్ (8/39) మంగళవారం ఢిల్లీతో మొదలైన గ్రూప్–బి మ్యాచ్లో తొలి ఓవర్లోనే హ్యాట్రిక్ సాధించాడు. టాస్ నెగ్గిన ఢిల్లీ బ్యాటింగ్కు దిగగా.. 3,4,5వ బంతులకు వరుసగా ధ్రువ్ షోరే, వైభవ్ రావల్, యశ్ ధూల్ను డకౌట్ చేశాడు. దాంతో, రంజీ ట్రోఫీ హిస్టరీలో తొలి ఓవర్లోనే హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్గా రికార్డు కెక్కాడు.
రెండో ఓవర్లో ఆయుష్ బదోనిని చిరాగ్ జాని డకౌట్ చేశాడు. దాంతో, తొలి నలుగురు బ్యాటర్లు సున్నాకే వెనుదిరిగారు. ఉనాద్కట్ 8 వికెట్లు తీస్తే.. ఇందులో మొదటి ఐదుగురు బ్యాటర్లు డకౌటవడం విశేషం. అతని దెబ్బకు ఓ దశలో ఢిల్లీ 10 రన్స్కే ఏడు వికెట్లు కోల్పోయి రంజీ ట్రోఫీలో లోయెస్ట్ స్కోరు (హైదరాబాద్ 21) రికార్డును బ్రేక్ చేసేలా కనిపించింది. అయితే, హృతిక్ షొకీన్ (68 నాటౌట్), శివాంక్ (38) ఆదుకోవడంతో ఢిల్లీ 133 రన్స్కు ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్కు వచ్చిన సౌరాష్ట్ర తొలి రోజు చివరకు 184/1 స్కోరుతో నిలిచింది. హార్విక్ దేశాయ్ (104 బ్యాటింగ్) సెంచరీ చేశాడు.