వేములవాడలో రెండోసారి కూలిన మూలవాగు బ్రిడ్జి

వేములవాడలో  రెండోసారి కూలిన  మూలవాగు బ్రిడ్జి

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మూలవాగుపై నిర్మిస్తోన్న రెండో బ్రిడ్జి రెండోసారి కూలిపోయింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మూలవాగు ఉధృతంగా ప్రవహించడంతో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి రెండోసారి కూలిపోయింది. 12 కోట్ల రూపాయలతో దాదాపు మూడు సంవత్సరాల క్రితం ప్రారంభమైన రెండు బ్రిడ్జిల నిర్మాణంలో ఒకటి పూర్తయింది. రెండేళ్ల క్రితం 2019 సెప్టెంబర్ 20న...మొదటిసారి రెండో బ్రిడ్జి కూలిపోయింది. 18 నెలల తర్వాత మళ్లీ అదే బ్రిడ్జి నిర్మాణం మొదలుపెట్టారు అధికారులు. ఇప్పుడు పడుతున్న వర్షాలతో రెండోసారి కూలిపోయింది బ్రిడ్జి.