న్యూఢిల్లీ: చైనాలో స్పీడ్గా వ్యాపిస్తున్న హెచ్9ఎన్2(ఏవియన్ ఇన్ఫ్లుయెంజా) వైరస్, చిన్న పిల్లల్లో పెరుగుతున్న శ్వాసకోశ సమస్యలను నిశితంగా పరిశీలిస్తున్నామని.. వాటితో మన దేశంలో పిల్లలకు అంతగా ప్రమాదంలేదని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.డబ్ల్యూహెచ్వో రిలీజ్ చేసిన అడ్వైజరీని కూడా ఫాలో అవుతున్నట్లు పేర్కొంది. ‘‘చైనాలోని పిల్లల్లో పెరుగుతున్న శ్వాసకోశ వ్యాధులకు సంబంధించి ఇప్పటి వరకు అసాధారణ కేసులేవీ నమోదు కాలేదు’’ అని ప్రభుత్వం చెప్పింది.
డబ్ల్యూహెచ్వో ప్రకటన ప్రకారం.. హెచ్9 ఎన్2 వైరస్ కు మనిషి నుంచి మనిషికి సోకే అవకాశం చాలా తక్కువ. ఈ వైరస్ తో మరణాల రేటు కూడా తక్కువేనని కేంద్రం పేర్కొంది. మరోవైపు, కరోనా మహమ్మారి తర్వాత దేశంలో ఆరోగ్య సదుపాయాలను బలోపేతం చేసిన విషయం గుర్తు చేసింది