- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్
ముషీరాబాద్,వెలుగు : పోషకార లోపంతో తల్లి బిడ్డలు అనారోగ్యానికి గురికాకుండా ఆరోగ్యంగా ఉండేందుకు ప్రధాని మోదీ పౌష్టిక ఆహారానికి పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. బుధవారం ముషీరాబాద్ కసిస్ ఫంక్షన్ హాల్ లో బీజేపీ కన్వీనర్ రమేశ్ రామ్ అధ్యక్షతన హెల్త్ బేబీ షో జరిగింది. వారు ముఖ్యఅతిథి హాజరై హెల్త్ కిట్స్ పంపిణీ చేశారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ..
దేశంలోని అన్నివర్గాల ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు కొత్త కార్యక్రమాలు కూడా తీసుకొస్తామని పేర్కొన్నారు. ప్రధాని మోదీ మహిళలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారని ఎంపీ లక్ష్మణ్ కొనియాడారు. మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు తెచ్చారని
మహిళలు ముందుకు వస్తే దేశం అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు రవి చారి, సుప్రియ, రచన శ్రీ, పూసరాజు, విజయలక్ష్మి, జమాల్పూర్ నందు, రమేశ్గౌడ్, వెంకటేశ్, కొల్లి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.