ప్రధాని టూర్ ను అడ్డుకోవడం ఎవరి తరం కాదు : కిషన్ రెడ్డి

ప్రధాని టూర్ ను అడ్డుకోవడం ఎవరి తరం కాదు : కిషన్ రెడ్డి

ప్రధాని టూర్ ను అడ్డుకోవడం ఎవరి తరం కాదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కనీస మర్యాదలు లేకుండా టీఆర్ఎస్ వ్యవహారశైలి ఉందన్నారు.  సీఎం వైఖరి తెలంగాణకు నష్టం కలిగిస్తుందని చెప్పారు. తెలంగాణలో  నిజాం రాజ్యాంగం కుదరదన్నారు. మోడీ సహకారం లేకుండానే  కాళేశ్వరం పూర్తయిందా అని ప్రశ్నించారు. ప్లెక్సీల డిజైన్ ప్రగతిభవన్ లో జరుగుతుందని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ప్రజల మద్దతు తమకు ఉందన్నారు. కేసీఆర్ కు తెలంగాణ అభివృద్ది పట్ల ప్రజల పట్ల ఎలాంటి గౌరవం లేదని కిషన్ రెడ్డి అన్నారు. కేవలం తన కుంటుబం గురించే కేసీఆర్  ఆలోచిస్తారని తెలిపారు. 

రాష్ట్రంలో మహిళ గవర్నర్ ను అడుగడుగునా అవమానిస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. తప్పుడు ప్రచారాలను లక్ష్యంగా పెట్టుకుని టీఆర్ఎస్  పనిచేస్తుందన్న కిషన్ రెడ్డి... ఎక్కువ రోజులు అబద్దాలతో కాలం గడపలేరన్నారు. ఎన్నికల టైమ్ లో ఇచ్చిన హమీలు ఏమయ్యాయని ఆయన  ప్రశ్నించారు. వీటిపై రోజూ ప్రశ్నిస్తామని, వదిలే ప్రసేక్తే లేదన్నారు. నిజాం నియంతృత్వ పాలనకు త్వరలో స్వస్తి పలుకుతామన్నారు.