శుక్రవారం వరంగల్ జిల్లాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పర్యటన సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు వరంగల్ అర్బన్ బిజేపి జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ. గురువారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆమె మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని, పీఎంఎస్ఎస్ వై కింద 150 కోట్లతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనుల పరిశీలిస్తారని చెప్పారు
హృదయ్ పథకంలో నిర్మిస్తున్న భద్రకాళీ బండ్ , అగ్గలయ్యగుట్ట జైన తీర్థంకరుల జైన్ విగ్రహాన అభివృద్ది పనుల పరిశీలించి.. ఆ తర్వాత సర్య్కూట్ గెస్ట్ హౌజ్ లో జిల్లాలోని రైల్వే అభివృద్ది పనులు, స్మార్ట్ సిటి పురోగతిపై అధికారులతో సమీక్ష జరుపునున్నట్టు తెలిపారు. టీవీఆర్ గార్డెన్ లో బిజేపి విస్తృతస్థాయి సమావేశానికి కిషన్ రెడ్డి హాజరుకానున్న నేపథ్యంలో రేపు పెద్ద సంఖ్యలో కిషన్ రెడ్డి కి కార్యకర్తలు స్వాగతం పలకాలని ఆమె అన్నారు