అందుకే.. కేసీఆర్ ఫాం హౌస్ ను వదిలి జిల్లాల్లో పర్యటిస్తున్నడు: కిషన్ రెడ్డి 

అందుకే.. కేసీఆర్ ఫాం హౌస్ ను వదిలి జిల్లాల్లో పర్యటిస్తున్నడు: కిషన్ రెడ్డి 

నాడు రక్తం ఏరులై పారినా మెట్రో నిర్మాణం వద్దన్న వ్యక్తికి.. నేడు ఎయిర్ పోర్టు మెట్రోకు శంకుస్థాపన చేసే అర్హత ఉందా? అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన మెట్రో ఫేజ్–Iలో భాగమైన ఓల్డ్ సిటీ మెట్రో పనులను ఎప్పుడు ప్రారంభిస్తారన్నారు. MMTS ఫేజ్–II ప్రాజెక్టుకు ఇవ్వవలసిన నిధులను ఎప్పుడు చెల్లిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.

8 సంవత్సరాలలో రూ. 800 కోట్ల ప్రాజెక్టును పూర్తి చేయటానికి సహకరించని కేసీఆర్, రూ. 6,250 కోట్ల ప్రాజెక్టును 3 సంవత్సరాలలో పూర్తి చేస్తానంటే ప్రజలు నమ్మాలా? అని కిషన్ రెడ్డి విమర్శించారు. ఈ బూటకపు వాగ్దానాలన్నీ ముందస్తు ఎన్నికల ప్రణాళికలో భాగమే అని.. అందుకే కేసీఆర్ ఫాం హౌస్ ను వదిలి జిల్లాల పర్యటన చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.