వ్యవసాయంపై ఫోకస్ చేస్తున్నం

వ్యవసాయంపై ఫోకస్ చేస్తున్నం

హైదరాబాద్, వెలుగు: మిల్లెట్స్‌‌‌‌ను ప్రోత్సహించేందుకు మోదీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌‌‌‌ తోమర్‌‌‌‌  పలు దేశాల మంత్రులకు వివరించారు. హైదరాబాద్‌‌‌‌ హెచ్‌‌‌‌ఐసీసీలో జరుగుతున్న జీ20 వ్యవసాయ మంత్రుల సమావేశం సందర్భంగా అమెరికా, యూకే, జపాన్, ఇటలీ దేశాల మంత్రులతో, యూరోపియన్  యూనియన్ కమిషనర్ తో తోమర్‌‌‌‌  భేటీ అయ్యారు.

ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. అమెరికా మంత్రి  ఎక్సోచిటల్ టోర్రెస్ స్మాల్ తో జరిగిన చర్చలో తోమర్ మాట్లాడుతూ ఇండియా, అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్య విలువలను పంచుకోవడం, అనేక విషయాలపై ఆసక్తుల కలయిక, శక్తివంతమైన వ్యక్తుల నుంచి స్ఫూర్తి పొందడం వంటి సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఈ రెండు దేశాలు కలిగి ఉన్నాయని అన్నారు.