యాక్సిస్ బ్యాంకు ఏటీఎం దగ్గర రూ.70 లక్షల చోరీ

యాక్సిస్ బ్యాంకు ఏటీఎం దగ్గర రూ.70 లక్షల చోరీ

హైదరాబాద్: నగర శివారులోని వనస్థలిపురంలో భారీ దోపిడి జరిగింది. ఏటీఎంలలో డబ్బులు నింపే సిబ్బంది దృష్టి మరల్చి ఏకంగా రూ.70 లక్షలను దుండగలు దోచుకున్నారు.

వనస్థలిపురంలోని పనామా వద్ద ఉన్న యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలో డబ్బులు నింపేందుకు ముగ్గురు సిబ్బంది ఓ కారులో వచ్చారు.  కారు నుండి డబ్బులు తీసి ఏటీఎంలో నింపే క్రమంలో.. ‘ కారు ముందు డబ్బులు పడ్డాయని’ ఓ వృద్ధుడు సిబ్బందికి చెప్పాడు. చేసే పనిని వదిలిపెట్టి ఆ సిబ్బంది అత్యాశతో కారు ముందు ఉన్న డబ్బు కోసం ముందుకు రాగా.. వారిని గమనించిన దుండగులు కారు వెనుక భాగంతో ఉన్న డబ్బును తీసుకొని పరారయ్యారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలినికి చేరుకుని, క్లూస్ టీమ్ లతో నిందితుల కోసం గాలిస్తున్నారు. సిబ్బంది నిర్లక్ష్యం, అత్యాశ వల్లనే ఈ దోపిడి జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.