కత్తులతో బెదిరించి.. వలస కూలీల నుంచి డబ్బులు వసూలు చేసిండ్రు

కత్తులతో బెదిరించి.. వలస కూలీల నుంచి డబ్బులు వసూలు చేసిండ్రు

వలస కూలీలను బెదిరించి గుర్తు తెలియని వ్యక్తులు డబ్బులు వసూలు చేసిన ఘటన రాజేంద్రనగర్​ సర్కిల్​ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అత్తాపూర్​ పోలీస్​స్టేషన్​ పరిధి శివాలయం వద్ద ఈ ఘటన జరగింది. అత్తాపూర్​ కుమ్మరి బస్తీకి చెందిన వెంకటయ్య, సిద్దులు వలస కూలీలు. స్థానికంగా పని చేస్తూ జీవిస్తున్నారు. 

వారిని ఇద్దరు దుండగులు కత్తితో బెదిరించారు. వాటిని చూసి కూలీలు భయపడ్డారు. అనంతరం దుండగులు వారి నుంచి రూ.12 వేలు, 2 సెల్​ఫోన్లను లాక్కెళ్లారు. తమను బెదిరించి దోచుకున్నారని బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

దోపిడీకి పాల్పడ్డ వారు ప్రేమ్​ సింగ్​, గిడ్డ సింగ్​గా గుర్తించి వారిని పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు.