బార్ లో ఫ్రెండ్స్ మధ్య గొడవ : మధ్యవర్తిగా వెళ్లిన యువకుడు హత్య

 బార్ లో ఫ్రెండ్స్ మధ్య గొడవ : మధ్యవర్తిగా వెళ్లిన యువకుడు హత్య

ఉప్పల్​ లో తాగుబోతులు  వీరంగం సృష్టించారు. మద్యం మోతాదుకు మించి తాగారో ఏమో తెలియదు కాని ఇద్దరు వ్యక్తులు  కొట్టుకుంటుండగా మరో వ్యక్తి  ( పవన్​ కుమార్​) నచ్చచెప్పేందుకు వెళ్లాడు. ఇక అంతే అందులో ఒకరు మధ్యవర్తిగా వచ్చిన   పవన్​ కుమార్​ ను  హత్య చేశారుడు. ఈ ఘటన రామంతాపూర్​ గుడ్​ డే బార్​ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...

రామంతాపూర్​ లోని  గుడ్​ డే బార్​ లో  ఆదివారం ( మే 25) రాత్రి పవన్ కుమార్(25) అ నే వ్యక్తిని  శ్రవణ్ అనే వ్యక్తి బీర్ బాటిల్ తో కొట్టడంతో పవన్ కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. శ్రవణ్..  అతని మిత్రుడు హరి   మధ్య ఘర్షణ  జరుగుతుండగా.. గొడవను ఆపేందుకు పవన్​ కుమార్​వెళ్లాడు.  దీంతో  చేతిలో ఉన్న బీరు సీసాతో పవన్​ను పొడవడంతో అక్కడికక్కడే మరణించాడు.  సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.  మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.  పవన్​ కుమార్​.. హరి.. శ్రవణ్​ ముగ్గురూ పరిచయస్తులే.  వీరిని అంబర్​ పేట.. పటేల్​ నగర్​ వాసులుగా పోలీసులు గుర్తించారు. వీరి మధ్య  పాతకక్షలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులువిచారిస్తున్నారు.