
ఉప్పల్ లో తాగుబోతులు వీరంగం సృష్టించారు. మద్యం మోతాదుకు మించి తాగారో ఏమో తెలియదు కాని ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటుండగా మరో వ్యక్తి ( పవన్ కుమార్) నచ్చచెప్పేందుకు వెళ్లాడు. ఇక అంతే అందులో ఒకరు మధ్యవర్తిగా వచ్చిన పవన్ కుమార్ ను హత్య చేశారుడు. ఈ ఘటన రామంతాపూర్ గుడ్ డే బార్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
రామంతాపూర్ లోని గుడ్ డే బార్ లో ఆదివారం ( మే 25) రాత్రి పవన్ కుమార్(25) అ నే వ్యక్తిని శ్రవణ్ అనే వ్యక్తి బీర్ బాటిల్ తో కొట్టడంతో పవన్ కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. శ్రవణ్.. అతని మిత్రుడు హరి మధ్య ఘర్షణ జరుగుతుండగా.. గొడవను ఆపేందుకు పవన్ కుమార్వెళ్లాడు. దీంతో చేతిలో ఉన్న బీరు సీసాతో పవన్ను పొడవడంతో అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పవన్ కుమార్.. హరి.. శ్రవణ్ ముగ్గురూ పరిచయస్తులే. వీరిని అంబర్ పేట.. పటేల్ నగర్ వాసులుగా పోలీసులు గుర్తించారు. వీరి మధ్య పాతకక్షలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులువిచారిస్తున్నారు.