నామినేషన్ వేసిన బండారి లక్ష్మారెడ్డి

నామినేషన్ వేసిన బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్, వెలుగు : ఉప్పల్ సెగ్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి గురువారం నామినేషన్ వేశారు.  అంతకుముందు కాప్రా డివిజన్​లోని జ్యోతిరావు ఫూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం చర్లపల్లి డివిజన్​లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. హౌసింగ్ బోర్డు కాలనీలో కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్​తో కలిసి బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నాచారానికి చేరుకున్నారు. 

నాచారం కార్పొరేటర్, బల్దియా స్టాండింగ్ కమిటీ మెంబర్ శాంతి సాయిజెన్ శేఖర్ దంపతులు బండారి లక్ష్మా రెడ్డికి గులాబీ సైన్యంతో ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా రిటర్నింగ్ ఆఫీసుకు వెళ్లి అక్కడ నామినేషన్ దాఖలు చేశారు. పండుగ వాతావరణంలో నామినేషన్ వేయడం ఆనందంగా ఉందని లక్ష్మారెడ్డి తెలిపారు. ఉప్పల్ సెగ్మెంట్​లో భారీ మెజార్టీతో గెలిచి గులాబీ జెండాను ఎగురవేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.