మనోహర్ పారికర్ తనయుడి ఓటమి

మనోహర్ పారికర్ తనయుడి ఓటమి

పనాజీ: గోవా మాజీ సీఎం మనోహర్‌ పారికర్‌  కొడుకు ఉత్పల్‌ పారికర్‌ ఓటమి పాలయ్యారు. బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పనాజీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థి ఏబీపీ మజ్హా చేతిలో 800 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎన్నికల్లో విజయం కోసం ఎంతో శ్రమించినా ఫలితం నిరాశ కలిగించిందని చెప్పారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసిన తాను గట్టి పోటీ ఇచ్చినట్లు చెప్పారు.తనకు మద్దతుగా నిలిచిన అందరికి ధన్యవాదాలు తెలిపారు. తన తండ్రి మనోహర్ పారికర్ స్థానం అయిన పనాజీ నుంచి బరిలో నిలిచినప్పటికీ ఉత్పల్ పారికర్ ఓటమి చవిచూడటం విశేషం. 40 స్థానాలున్న గోవా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ 20స్థానాల్లో గెలుపొందగా.. కాంగ్రెస్ 11 సీట్లను ఖాతాలో వేసుకుంది.

మరిన్ని వార్తల కోసం

ఉత్తరాఖండ్లో సీఎం అభ్యర్థుల ఓటమి

బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్పై హైకోర్టులో ముగిసిన వాదనలు